అంచనాలను అందుకున్న ఇన్ఫీ  | Sakshi
Sakshi News home page

అంచనాలను అందుకున్న ఇన్ఫీ 

Published Tue, Oct 16 2018 4:35 PM

Infosys Q2 profit Rs 4,110 crore, meets Street estimates  - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ  ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మెరుగైన ఫలితాలను ప్రకటించింది.  సెప్టెంబరు 30తో ముగిసిన  రెండవ త్రైమాసిక ఫలితాల్లో వార్షిక ప్రాతిపదికన 10.3శాతం లాభాల వృద్ధిని సాధించింది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 6-8శాతం వుంటుందని ఇన్ఫోసిస్‌ వెల్లడించింది.

మార్కెట్‌ ముగిసిన అనంతరం ప్రకటించిన ఫలితాల్లో  ఎనలిస్టులు అంచనాలకు మించి   ఈ ఆర్థికసంవత్సరం రెండవ త్రైమాసికంలో  రూ. 4,110 కోట్ల నికర లాభాలాను సాధించింది. ఆదాయం 17.30 శాత ఎగిసి 20,609 కోట్ల  రూపాయలను సాధించింది.  కఆపరేటింగ్‌ మార్జిన్లు 23.7శాతంగా ఉన్నాయి.

డివిడెండ్‌: అలాగే ప్రతి ఈక్విటీ షేరుకు 7రూపాయల చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. అక్టోబరు 30 తరువాత డివిడెండ్‌ చెల్లింపు  ఉంటుందని తెలిపింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement